Jagan: తిరుపతికి బయల్దేరిన జగన్

  • తిరుపతికి రానున్న రాష్ట్రపతి
  • స్వాగతం పలికేందుకు బయల్దేరిన జగన్
  • ఇప్పటికే తిరుపతి చేరుకున్న గవర్నర్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తిరుపతికి బయల్దేరారు. విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో పయనమయ్యారు. కాసేపట్లో ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ సాయంత్రం తిరుపతికి రానున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు జగన్ తిరుపతికి వెళ్లారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో, గవర్నర్ నరసింహన్ ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన అనంతరం... సాయంత్రానికల్లా జగన్ తిరిగి విజయవాడ చేరుకోనున్నారు.

More Telugu News