Andhra Pradesh: గిరిజన మహిళలతో కలిసి ‘థీంసా’ స్టెప్పులేసిన ఏపీ టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్.. వీడియో వైరల్!

  • విశాఖ మన్యంలో పర్యటించిన ఏపీ మంత్రి
  • గిరిజనులకు వ్యవసాయ పనిముట్ల పంపిణీ
  • మోదుకొండమ్మ ఆలయాన్ని దర్శించుకున్న అవంతి

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈరోజు విశాఖపట్నంలోని ఏజెన్సీలో పర్యటించారు. ఈ సందర్భంగా పాడేరు ఏజెన్సీలోని ఐటీడీఏ ఆఫీసులో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయడంపై చర్చించారు.

ఈ సందర్భంగా స్థానిక గిరిజన రైతులకు వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు.  ఈ పర్యటనలో భాగంగా పాడేరులోని మోదుకొండమ్మ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ ‘థీంసా’ డ్యాన్స్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

More Telugu News