Rakesh: బావిలోకి దిగిన ముగ్గురు యువకుల మృతి

  • బావిలోకి దిగిన శ్రీనివాస్, రాకేశ్, మహేశ్
  • శ్వాస అందకపోవడంతో మృతి
  • యువకుల మృతితో కౌటాలలో విషాదం

బావిలోకి దిగిన ముగ్గురు యువకులు శ్వాస అందకపోవడంతో మృతి చెందడంతో వారి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కొమరం భీం ఆసీఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని ముత్యంపేటకు చెందిన శ్రీనివాస్(28), రాకేశ్(20), మహేశ్(19) అనే ముగ్గురు యువకులు బావిలోకి దిగారు. అయితే శ్వాస అందకపోవడంతో ముగ్గురు యువకులూ మృతి చెందారు. అయితే ముగ్గురు యువకులు బావిలోకి దిగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

More Telugu News