Andhra Pradesh: జగన్ గారూ.. పచ్చబొట్టులాంటి టీడీపీ అభివృద్ధికి స్టిక్కర్లు వేయాలంటే మీకు ఐదేళ్లూ సరిపోవు!: నారా లోకేశ్ సెటైర్లు

  • బడికొస్తా కార్యక్రమం కోసం సైకిళ్లు కొన్న టీడీపీ ప్రభుత్వం
  • తాజాగా రాజన్న బడిబాట స్టిక్కర్లతో వాటిని అందిస్తున్న వైసీపీ
  • స్టిక్కర్లు ఉన్న వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన నారా లోకేశ్

టీడీపీ ప్రభుత్వం ‘బడికొస్తా’ కార్యక్రమం కింద విద్యార్థులకు అందించేందుకు తీసుకొచ్చిన సైకిళ్లకు వైసీపీ ప్రభుత్వం ‘రాజన్న బడిబాట’ స్టిక్కర్లు వేసిందని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని స్టిక్కర్లు వేసినా టీడీపీ చేసిన పచ్చబొట్టులాంటి అభివృద్ధిని మరుగున పడేయడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.

గత ఐదేళ్లు టీడీపీ చేపట్టిన అభివృద్ధి పనులకు స్టిక్కర్లు వేసుకుంటూ పోతే సీఎం జగన్ కు వచ్చే ఐదేళ్లు కూడా చాలవని హితవు పలికారు. ఈ మేరకు నారా లోకేశ్ ఈరోజు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు బడికొస్తా స్టిక్కర్ పై రాజన్న బడిబాట స్టిక్కర్ ను అంటించిన వీడియోను నారా లోకేశ్ పోస్ట్ చేశారు.

More Telugu News