World Cup: ఇండియా-న్యూజిలాండ్ సెమీస్.. ఇరు జట్ల తరపున ఎవరెవరు ఆడే అవకాశం?

  • చాహల్ కు ఛాన్స్ దక్కే అవకాశం
  • పెద్దగా రాణించకపోయినా కుల్దీప్ కు ఛాన్స్
  • లోయర్ మిడిల్ ఆర్డర్ లో దినేశ్ కార్తీక్

మరి కొన్ని గంటల్లో ప్రపంచకప్ లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా తొలి సెమీఫైనల్స్ జరగనుంది. అత్యంత బలంగా ఉన్న టీమిండియాను న్యూజిలాండ్ ఎదుర్కోబోతోంది. టీమిండియాకు విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తుండగా... న్యూజిలాండ్ కెప్టెన్ గా కేన్ విలియమ్స్ జట్టును నడిపిస్తున్నాడు.

మరోవైపు, టీమిండియా జట్టులోకి యజువేంద్ర చాహల్ వచ్చే అవకాశం కనపడుతోంది. రవీంద్ర జడేజా స్థానంలో చాహల్ కు అవకాశం లభించే ఛాన్స్ ఉంది. 7 మ్యాచుల్లో 6 వికెట్లు మాత్రమే తీసినప్పటికీ... కుల్దీప్ యాదవ్ కు జట్టులో స్థానం కల్పించవచ్చు. ఐదుగురు బౌలర్ల ఫార్ములాతో ఆడాలనుకుంటున్న టీమిండియా భువనేశ్వర్ కుమార్ కు కూడా అవకాశం ఇవ్వచ్చు. చివరి మ్యాచ్ లో మొహమ్మద్ షమీ స్థానంలో భువనేశ్వర్ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. లోయర్ మిడిల్ ఆర్డర్ లో దినేశ్ కార్తీక్ కు స్థానం దక్కే అవకాశం ఉంది. రెండు టీముల తుది జట్లు ఈ విధంగా ఉండవచ్చు.

టీమిండియా: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషభ్ పంత్, ధోనీ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా.

న్యూజిలాండ్: మార్టిన్ గుప్టిల్, కొలిన్ మన్రో, కేన్ విలియంసన్ (కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్, కొలిన్ గ్రాండ్ హోమ్, మిచెల్ శాంట్నర్, మాట్ హెన్రీ, ఫెర్గ్యూసన్, ట్రెంట్ బౌల్ట్.

More Telugu News