Nagarkurnool District: మతిస్థిమితం లేదని...కన్నకూతుర్ని నరికి చంపిన కసాయి

  • భర్త వదిలేయడంతో కొన్నాళ్లుగా పుట్టింట్లో
  • ఆదివారం అర్ధరాత్రి తర్వాత హత్య చేసిన తండ్రి
  • ఈరోజు ఉదయం వెలుగుచూసిన ఘటన

కన్నకూతుర్ని దారుణంగా నరికి చంపాడో కసాయి తండ్రి. ఒళ్లు గగుర్పాటు కలిగించే ఈ ఘటన ఈరోజు ఉదయం వెలుగు చూడడంతో స్థానికంగా కలకలానికి కారణమైంది. వివరాల్లోకి వెళితే...తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని కల్వకోల్‌ గ్రామానికి చెందిన ఎర్రన్న కూతురు శ్యామల (26). కొన్నేళ్ల క్రితం కూతుర్ని ఓ అయ్య చేతిలో పెట్టి బాధ్యత తీర్చుకున్నాడు ఎర్రన్న. పెళ్లయిన కొన్నాళ్లకు శ్యామలకు మతి స్థిమితం తప్పింది. దీంతో ఆమెను భర్త విడిచి పెట్టేశాడు. కొన్నాళ్లుగా శ్యామల పుట్టింట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎర్రయ్య ఈ దారుణానికి ఒడిగట్టాడు. సోమవారం తండ్రి ఘాతుకాన్ని తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

More Telugu News