MOvie: ప్రతి ట్వీట్ నా హృదయాన్ని తాకుతోంది: నటి సమంత

  • ‘ఓ బేబీ’ ‘థ్యాంక్స్ మీట్’
  • విడుదలకు ముందు రోజు రాత్రి నాకు నిద్రపట్టలేదు
  • ప్రతి ట్వీట్ ను చదువుతా.. అందరికీ రిప్లై ఇవ్వలేను

నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ఓ బేబీ’ హిట్ టాక్ సంపాదించుకోవడంతో చిత్రయూనిట్ సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ‘థ్యాంక్స్ మీట్’ ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందినీరెడ్డి, నటి సమంత, చిత్ర యూనిట్ తో పాటు హీరో రానా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ, ఈ సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి మొత్తం తనకు నిద్రపట్టలేదని తెలిపింది. ఈ చిత్రం విడుదలైన తొలిరోజు నుంచే పాజిటివ్ స్పందనలు వచ్చాయని చెప్పింది. ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న రోజుల కన్నా ప్రమోషన్ లో పాల్గొన్న రోజులే ఎక్కువని నవ్వులు చిందించింది.

‘ఓ బేబీ’లో తన పాత్రతో ఎంతో సంతృప్తి చెందిన తాను ఈ సినిమా తర్వాత ఇంకేం చేయాలని, ఇక రిటైర్మెంట్ తీసుకోవాలా? అని నందినీరెడ్డితో తాను ప్రస్తావించిన విషయాన్ని సమంత గుర్తుచేసుకుంది. ఈ సినిమా తర్వాత ఏ చిత్రంలో నటించాలి? ఏ చిత్రంలో నటించకూడదు?అనే తికమకలో ఉన్నానని, అయితే, ఈ స్థితి మరో రెండు రోజులు మాత్రమే ఉంటుందని తనకు తెలుసని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో తన ఫాలోవర్స్ చేసే ప్రతి ట్వీట్ ను చదువుతాను కానీ, అందరికీ రిప్లై ఇవ్వలేనని చెప్పిన సమంత, ప్రతి ట్వీట్ తన హృదయాన్ని తాకుతోందని చెప్పారు.

More Telugu News