Crime News: గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో గాయపడిన వ్యాపారి రాంప్రసాద్‌ మృతి

  • నిన్న రాత్రి పంజాగుట్టలో దాడిచేసిన దుండగులు
  • కత్తితో విచక్షణా రహితంగా పొడవడంతో తీవ్రగాయాలు
  • ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ వ్యాపారి రాంప్రసాద్‌ ఈరోజు తెల్లవారు జామున చనిపోయారు. నిన్నరాత్రి పంజాగుట్ట వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి వస్తుండగా మాటువేసిన దుండగులు కత్తులతో దాడిచేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాంప్రసాద్‌ను సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ  మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రాంప్రసాద్‌కు విజయవాడలో ఓ స్టీల్‌ ప్లాంట్‌ ఉందని, గతంతో ఈ ఫ్యాక్టరీలో భాగస్వామి అయిన కోగంటి సత్యం అనే వ్యక్తితో భాగస్వామ్యం ఉండేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భాగస్వామ్యం రద్దు చేసుకున్నాక సత్యం నుంచి తరచూ బెదిరింపు ఫోన్లు వస్తుండేవని, అతనే కిరాయి హంతకులతో ఈ హత్య చేయించి ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాంప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆధారాల కోసం వేంకటేశ్వరస్వామి ఆలయంలోని సీసీ కెమెరాల పుటేజీ పరిశీలిస్తున్నారు.

More Telugu News