Nadendla Bhaskar Rao: అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల

  • తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా
  • బీజేపీలో చేరిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రవదన్
  • ఇంకా పలువురి చేరిక  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరారు. నేడు కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా అమిత్‌ షాను నాదెండ్ల కలిశారు. ఆయనకు కాషాయ కండువా కప్పి అమిత్ షా సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు. అలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రవదన్ కూడా అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా  పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

More Telugu News