New Delhi: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బోనాల ఉత్సవం.. పాల్గొన్న కళాకారులు, అధికారులు

  • రెండు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు
  • తొలిరోజు అమ్మవారి ఘట స్థాపన
  • ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఊరేగింపు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు దేశం మొత్తానికి  తెలిసేలా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం బోనాలను ఘనంగా నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలను  తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో నిర్వహించనుంది. తొలిరోజు ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ భవన్‌లో అమ్మవారి ఘట స్థాపన చేశారు. ఈ ఉత్సవాల్లో తెలంగాణకు చెందిన అధికారులు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఊరేగింపు ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకూ కొనసాగింది.

More Telugu News