Team India: సెమీస్ చేరిన భారత జట్టుకు కేటీఆర్ అభినందనలు

  • బంగ్లాదేశ్‌పై భారత్ విజయం తర్వాత కేటీఆర్ ట్వీట్
  • టైటిల్ వేటలో రెండడుగుల దూరంలో భారత్
  • రోహిత్ అద్భుత సెంచరీ

ప్రపంచకప్‌లో సెమీస్‌‌కు చేరిన కోహ్లీసేనకు టీఆర్ఎస్ అగ్రనేత, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ప్రపంచకప్‌ సాధించేందుకు మరో రెండు విజయాల దూరంలో భారత జట్టు నిలిచిందని ట్వీట్ చేశారు. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 314 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 286 పరుగులకే ఆలౌటై సెమీస్ రేసు నుంచి తప్పుకుంది.

More Telugu News