niveda pethuraj: బన్నీ సరసన నాయికగా మరో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

  • 'మెంటల్ మదిలో' ద్వారా పరిచయం
  •  'బ్రోచేవారెవరురా'తో మరింత గుర్తింపు
  •  బన్నీ నుంచి మార్కులు కొట్టేసిన నివేదా పేతురాజ్

'మెంటల్ మదిలో' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన నివేదా పేతురాజ్ కి, ఆ తరువాత చేసిన 'చిత్రలహరి' .. 'బ్రోచేవారెవరురా' మంచి పేరును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఈ అమ్మాయి త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమాలో చేస్తోంది. ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తుండగా, రెండవ నాయికగా నివేదా పేతురాజ్ చేస్తోంది.

సినిమా .. సినిమాకి ఈ సుందరి క్రేజ్ పెరుగుతుండటం వలన, ఆమె నటన నచ్చడం వలన తన తదుపరి సినిమాకి ఆమెను అల్లు అర్జున్ సిఫార్స్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాకి 'ఐకాన్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో నాయికగా నివేదా పేతురాజ్ అవకాశాన్ని దక్కించుకుందని అంటున్నారు.

More Telugu News