పాలకొల్లులో ‘ఎస్వీ రంగారావు ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్’.. ప్రారంభించనున్న పవన్ కల్యాణ్!

  • ప్రిన్సిపాల్ గా రాజా వన్నెంరెడ్డి
  • నటన, దర్శకత్వంలో శిక్షణ
  • చైర్మన్ గా హరిరామజోగయ్య
అల్లు రామలింగయ్య, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ వంటి సినీ దిగ్గజాలు పాలకొల్లు నుంచి వచ్చారని జనసేన పార్టీ తెలిపింది. ఎందరో సినీ కళాకారులకు పుట్టినిల్లు అయిన పాలకొల్లులో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ను ప్రారంభించబోతున్నామని వెల్లడించింది. ఈ సంస్థకు ‘ఎస్వీ రంగారావు ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్’గా నామకరణం చేశామని చెప్పింది. ఈ విషయమై పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ స్పందిస్తూ.. ఈ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ కు హరిరామజోగయ్య చైర్మన్ గా వ్యవహరిస్తారని తెలిపారు.

రాజా వన్నెంరెడ్డి, బన్నీవాసు నేతృత్వంలో ఈ ఇన్ స్టిట్యూట్ నడుస్తుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల యువతకు ఉపయోగపడేలా ఈ సంస్థను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ ఇన్ స్టిట్యూట్ లో నటన, దర్శకత్వంలో శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ ఇన్ స్టిట్యూట్ ప్రిన్సిపాల్ గా రాజా వన్నెంరెడ్డి వ్యవహరిస్తారనీ, సంస్థ ప్రారంభోత్సవానికి పవన్ కల్యాణ్ వస్తారని ప్రకటించారు. విద్యార్థులకు సినీరంగంలో మెలకువలు నేర్పించే ఫ్యాకల్టీ ఇప్పటికే సిద్ధమయిందని తెలిపారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
palakollu
film institute
sv rangarao
Pawan Kalyan
Jana Sena

More Telugu News