meghamsh: నాన్న సినిమాలు చూస్తే ఏడుపొస్తుంది: శ్రీహరి తనయుడు మేఘాంశ్

  • నాన్న సినిమాలు చూస్తుంటాము
  • ఏదో ఒక సందర్భంలో నాన్న గుర్తొస్తూనే వుంటారు
  • నా తొలి సినిమాలో నాతో నాన్న చేస్తే బాగుండేది

శ్రీహరి తనయుడు మేఘాంశ్ 'రాజ్ దూత్' సినిమాతో తెలుగు తెరకి హీరోగా పరిచయమవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూల్లో ఆయన మాట్లాడుతూ .. "టీవీలోగానీ .. యూట్యూబ్ లో గాని నాన్న సినిమాలు చూసినప్పుడు బాధగా అనిపిస్తుంది. ఆయన చేసిన ఎమోషనల్ సీన్స్ చూసినప్పుడు ఏడుపొచ్చేస్తుంది.

ఆయన చేసిన సినిమాల కలెక్షన్స్ మా దగ్గర వున్నాయి. తరచూ వాటిని చూస్తూనే ఉంటాము. 'రాజ్ దూత్' సినిమాలో ఆదిత్య మీనన్ 'రాజన్న' పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్రను మా నాన్నగారు చేస్తే బాగుండేది కదా అనిపించింది. మా అన్నయ్య కూడా అదేమాట అన్నాడు. ఇలా నాన్న ఏదో ఒక సందర్భంలో గుర్తొస్తూనే వుంటారు .. ఆయన గురించి మేము మాట్లాడుకుంటూనే ఉంటాము" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News