rajasekhar: రేపే 'ఓ బేబీ' ప్రీ రిలీజ్ ఈవెంట్

  • సమంత ప్రధాన పాత్రధారిగా 'ఓ బేబీ'
  • వచ్చేనెల 5వ తేదీన విడుదల 
  • అందరిలో పెరుగుతోన్న ఆసక్తి

సమంత ప్రధాన పాత్రధారిగా 'ఓ బేబీ' సినిమా రూపొందింది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వచ్చేనెల 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. రేపు సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని 'జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్' లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇంతకు ముందు లేడీ ఓరియెంటెడ్ సినిమాగా సమంత చేసిన 'యూ టర్న్'కి మంచి ఆదరణ లభించింది. దాంతో సహజంగానే 'ఓ బేబీ'పై అందరిలో ఆసక్తి వుంది. ఆల్రెడీ ఈ కథ ఏడు భాషల్లో విజయాన్ని సాధించిందని సమంత చెప్పడంతో, ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను 'ఓ బేబీ' ఎంతవరకూ అందుకుంటుందో చూడాలిమరి.

More Telugu News