Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ లో ఘోరప్రమాదం... 11 మంది విద్యార్థుల దుర్మరణం

  • మృతుల్లో 9 మంది అమ్మాయిలు
  • పీర్ కిగలీ వద్ద లోయలో పడిన మినీ బస్సు
  • కంప్యూటర్ ఇన్ స్టిట్యూట్ విద్యార్థులతో ప్రయాణిస్తున్న బస్సు

జమ్మూకశ్మీర్ లో విషాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళుతున్న ఓ బస్సు ప్రమాదానికి గురికావడంతో 11 మంది మరణించారు. పూంఛ్ లోని ఓ కంప్యూటర్ శిక్షణ కేంద్రానికి చెందిన విద్యార్థులు మినీ బస్సులో ప్రయాణిస్తుండగా పీర్ కిగలీ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. వారు ప్రయాణిస్తున్న మినీ బస్సు ఓ లోయలో పడిపోయింది. 11 మంది అక్కడికక్కడే మరణించారు. వారిలో 9 మంది విద్యార్థినులు ఉన్నారు. ఈ దుర్ఘటనలో మరో ఏడుగురు తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను షోపియాన్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యేంద్రపాల్ రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

More Telugu News