Harish Rao: బావా.. మళ్లీ కుదరదేమో.. మన పాత చాంబర్లు చూసుకుందామా?: హరీష్ తో కేటీఆర్

  • సచివాలయం, అసెంబ్లీ భూమి పూజకు హాజరైన కేటీఆర్, హరీష్
  • ఈ సందర్భంగా ముచ్చటించుకున్న ఇరువురు నేతలు
  • కేటీఆర్ వ్యాఖ్యలకు చిరునవ్వులు చిందించిన హరీష్

ఈ రోజు తెలంగాణ సచివాలయం, అసెంబ్లీలకు భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.

'బావా.. మళ్లీ కుదరదేమో... మన పాత చాంబర్లను ఒకసారి చూసుకుందామా?' అని హరీష్ రావుతో కేటీఆర్ అన్నారు. ఈ వ్యాఖ్యలకు హరీష్ చిరునవ్వులు చిందించారు. అనంతరం కార్యకర్తలతో కలసి ఇద్దరూ సెల్ఫీలు దిగి వెళ్లిపోయారు. మరోవైపు, వీరిద్దరినీ మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకునే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

More Telugu News