chakravarthi: 'గులాబీ' సినిమా కోసం ఇల్లు అమ్మేద్దామనుకున్నాను: జేడీ చక్రవర్తి

  • 'గులాబీ' కథ నాకు బాగా నచ్చేసింది
  •  నిర్మాతలు ముందుకు రాలేదు
  •  వర్మ మాటిచ్చాడన్న జేడీ  

జేడీ చక్రవర్తి కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'గులాబీ' ఒకటి. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ సినిమాను గురించి ప్రస్తావించారు. 'గులాబీ' కథను కృష్ణవంశీ గారు చెప్పినప్పుడు నాకు విపరీతంగా నచ్చేసింది. ఈ కథను తీసుకుని నిర్మాత దువ్వాసి మోహన్ దగ్గరికి వెళితే, కథంతా వినేసి 'హీరో రాజశేఖర్ తో చేస్తే ఎలా ఉంటుంది?' అన్నాడు. అప్పటికి దువ్వాసి మోహన్ ఇంకా యాక్టర్ కాలేదు.

ఆ కథ తీసుకుని చాలామంది నిర్మాతల దగ్గరికి వెళ్లాను. కానీ నాతో సినిమా చేయడానికి వాళ్లెవరూ ముందుకురాలేదు. దాంతో ఇల్లు అమ్మేద్దామని నిర్ణయించుకుని, ప్రయత్నాలు మొదలెట్టాను. ఈ విషయం వర్మగారికి తెలిసి నాకు చీవాట్లు పెట్టారు. ఇల్లు అమ్మొద్దనీ .. అమితాబ్ తో కలిసి తనే ఈ సినిమాను నిర్మిస్తానంటూ ముందుకొచ్చారు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News