వైసీపీ ప్రభుత్వంపై ఏడాదిపాటు విమర్శలు చేయం: పవన్ కల్యాణ్
- సత్ఫలితాలు ఇచ్చే పథకాలు ప్రవేశపెడితే హర్షిస్తాం
- ప్రజలకు ఇబ్బంది కలిగితే పోరాడతాం
- తెలంగాణకు ఏపీ భవనాలు అప్పగించడంపై వైసీపీ వివరణ ఇవ్వాలి
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ సచివాలయ భవనాలు అప్పగించడంపై ఆయన స్పందించారు. ఈ విషయమై వైసీపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివరణ ఇవ్వడం ద్వారా ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య సున్నితమైన అంశాలు ఉన్నాయని, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని క్షేత్ర స్థాయిలో అందరితో మాట్లాడి తమ కార్యాచరణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.