హరీశ్.. నీలా నేను వెనుక గోతులు తీయను.. దమ్ముంటే అమరవీరుల స్థూపం దగ్గర చర్చకు రా!: జగ్గారెడ్డి సవాల్
- సోనియా గాంధీనే తెలంగాణ ఇచ్చింది
- లేదంటే కేసీఆర్ సీఎం అయ్యేవారా?
- హరీశ్ రావుపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేత
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని కుట్ర జరుగుతోందని జగ్గారెడ్డి ఆరోపించారు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం మానుకోవాలని టీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. ఏ ప్రాజెక్టును ఎవరు కట్టారో జనం దగ్గరకు వెళదామనీ, తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు చర్చకు రావాలని టీఆర్ఎస్ నేత హరీశ్ రావుకు సవాల్ విసిరారు. హరీశ్ రావులా తాను వెనుక గోతులు తీయనని విమర్శించారు. ఇంట్లో పంచాయతీ ఉంటే మీరు-మీరు చూసుకోవాలని చురకలు అంటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచిన తరహాలో రాష్ట్రంలోని ప్రతిపక్షాలను కూడా సీఎం కేసీఆర్ ఆహ్వానించి ఉంటే బాగుండేదని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.