YSRCP: వివేకా హత్యకేసు దర్యాప్తు ముమ్మరం.. ప్రత్యేక బృందం ఏర్పాటు

  • మార్చిలో వివేకానందరెడ్డి హత్య
  • బుధవారం వివేకా ఇంటిని పరిశీలించిన కొత్త బృందం
  • వాచ్‌మన్ రంగయ్యను విచారించిన అధికారులు

ఈ ఏడాది మార్చిలో హత్యకు గురైన మాజీ మంత్రి, వైసీపీ నేత వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం  అనంతపురం, చిత్తూరు, తిరుపతికి చెందిన పోలీసు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో ఈ బృందం దర్యాప్తును ముమ్మరం చేయనుంది. కొత్త బృందం బుధవారం వైఎస్ వివేకానందరెడ్డి ఇంటిని పరిశీలించింది.  అనంతపురం జిల్లా పెనుగొండ డీఎస్పీ రామకృష్ణ, పులివెందుల డీఎస్పీ వాసుదేవన్‌, సీఐలు శ్రీరాం‌, అమిత్‌ఖాన్‌, రామాంజినాయక్‌, పలువురు ఎస్‌ఐలు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పులివెందులలోని వివేకానందరెడ్డి ఇంటికి చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వాచ్‌మన్‌ రంగయ్యను విచారించారు.

మార్చి 15న జరిగిన వివేకా హత్యకేసు అప్పట్లో పెను సంచలనమైంది. ఈ హత్యకేసుపై వెంటనే స్పందించిన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. అయితే, ఎన్నికల నేపథ్యంలో దర్యాప్తు ముందుకు సాగలేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం తాజాగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.

More Telugu News