guntur: గుంటూరు జిల్లాలో ఇద్దరికి మినహా టీడీపీ నేతలందరికీ గన్ మెన్ల తొలగింపు

  • టీడీపీ మాజీ ప్రజాప్రతినిధులకు గన్ మెన్ల తొలగింపు
  • కోడెల, యరపతినేనిలకు మాత్రం వన్ ప్లస్ వన్ గన్ మెన్లు
  • ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న టీడీపీ శ్రేణులు

టీడీపీ మాజీ ప్రజాప్రతినిధులకు గన్ మెన్ల తొలగింపు వ్యవహారం ఊపందుకుంది. గుంటూరు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతలు మినహా మిగిలిన మాజీ ఎమ్మెల్యేలందరికీ గన్ మెన్లను తొలగిస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోడెల శివప్రసాదరావు, యరపతినేని శ్రీనివాసరావులకు మాత్రం వన్ ప్లస్ వన్ గన్ మెన్లను కేటాయించింది. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు సైతం గన్ మెన్లను నిరాకరించింది. మరోవైపు, గన్ మెన్లను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్దేశ పూర్వకంగానే భద్రతను తొలగిస్తున్నారంటూ మండిపడుతున్నాయి.

More Telugu News