High Court: జగన్ పై దాడి కేసు నిందితుడి బెయిల్ రద్దు చేయాలని కోరిన ఎన్ఐఏ

  • గత నెల 22న బెయిల్ పై విడుదలైన నిందితుడు శ్రీనివాస్
  • నిందితుడు బయట ఉండటం వల్ల నష్టం జరిగే ప్రమాదం ఉందన్న ఎన్ఐఏ   
  • ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎన్ఐఏ తరపు న్యాయవాది

గతంలో జగన్ పై దాడికి పాల్పడ్డ నిందితుడు శ్రీనివాస్ కు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోరింది, ఈ మేరకు ఏపీ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఎన్ఐఏ తరపు న్యాయవాది ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు బయట ఉండటం వల్ల నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆ పిటిషన్ లో పేర్కొన్నట్టు సమాచారం. కాగా, గత నెల 22న బెయిల్ పై నిందితుడు శ్రీనివాస్ విడుదలయ్యాడు.

More Telugu News