Cricket: భారత్, న్యూజిలాండ్ వరల్డ్ కప్ మ్యాచ్ వర్షార్పణం... ఉసూరుమన్న అభిమానులు!

  • వరల్డ్ కప్ పై వరుణుడి పంజా
  • చెరో పాయింట్ పంచుకున్న ఇరు జట్లు
  • పాయింట్ల పట్టికలో మూడోస్థానంలో భారత్

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో మరో మ్యాచ్ వరుణుడి పాలైంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ట్రెంట్ బ్రిడ్జ్ లో జరగాల్సిన లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ జరుగుతుందని ఆశించిన అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఈ మ్యాచ్ లో కనీసం టాస్ కూడా వేయలేకపోయారు. పలుమార్లు వర్షం దోబూచులాడగా, ఇక మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని భావించిన అంపైర్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో, భారత్, న్యూజిలాండ్ జట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత్ రెండు విజయాలతో మూడో స్థానంలో నిలిచింది.

More Telugu News