Jammu And Kashmir: ఉగ్రదాడిలో అమరులైన ఐదుగురు జవాన్లు.. ఓ ఉగ్రవాది హతం

  • పెట్రోలింగ్ పార్టీపై ఉగ్రదాడి
  • తీవ్రంగా గాయపడిన ముగ్గురు జవాన్లు
  • తప్పించుకున్న ఉగ్రవాది

ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు. జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో జవాన్లపై జరిగిన దాడిలో ఐదుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులవగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.

నిత్యం రద్దీగా ఉండే కేపీ రోడ్డులో పెట్రోలింగ్ పార్టీ పోలీసులపై ఉగ్రవాదులు తుపాకులు, గ్రనేడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. మరో ఉగ్రవాది తప్పించుకున్నాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అనంతనాగ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అర్షద్ అహ్మద్‌ను శ్రీనగర్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు.

పాకిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ అల్ -ఉమర్ ముజాహిదీన్ ఈ ఘటనకు బాధ్యత ప్రకటించింది. అయితే, ఇది జేషే మహ్మద్ దాడిని పోలి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

More Telugu News