Tirupathi: తుడా చైర్మన్ గా చెవిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు

  • చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చెవిరెడ్డి
  • ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్న చెవిరెడ్డి 
  • చెవిరెడ్డి అనుచరుల సంతోషం

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మరో పదవి వరించింది. తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్ గా ఆయన్ని నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో మూడేళ్లపాటు ఆయన కొనసాగనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా ఉన్న చెవిరెడ్డికి తుడా చైర్మన్ గా మరో పదవి దక్కడంపై  ఆయన అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 

More Telugu News