sensex: నేడు కూడా మార్కెట్లలో కొనసాగిన జోరు

  • వరుసగా మూడో రోజు లాభాలు
  • 166 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 43 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, మెటల్, ఎనర్జీ, ఆయిల్ మరియు గ్యాస్ షేర్ల అండతో ఈ రోజు లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 166 పాయింట్లు లాభపడి 39,950కి ఎగబాకింది. నిఫ్టీ 43 పాయింట్లు పెరిగి 11,966కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (2.71%), ఓఎన్జీసీ (2.58%), యస్ బ్యాంక్ (2.50%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.39%), వేదాంత లిమిటెడ్ (2.30%).

టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-3.00%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.38%), ఎల్ అండ్ టీ (-0.49%), కోల్ ఇండియా (-0.48%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.41%).

More Telugu News