Chada Venkatareddy: పోడు భూములతోపాటు భూ ప్రక్షాళనలోని లోపాలపై ఉద్యమాలు: చాడ వెంకటరెడ్డి

  • 19, 20 తేదీల్లో ప్రాజెక్టుల సందర్శన
  • రెండోసారి అధికారం చేపట్టాక పాలన గాడి తప్పింది
  • కాళేశ్వరం, ప్రాణహిత, తుమ్మిడిహట్టిల పరిశీలన
పోడు భూములతో పాటు భూ ప్రక్షాళనలో చోటు చేసుకుంటున్న లోపాలపై స్థానికంగా ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. నేడు ఆయన హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానాలను మీడియాకు వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టుల సందర్శనను ఈనెల 19, 20 తేదీల్లో రాష్ట్ర ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో చేపట్టాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ప్రధానంగా కాళేశ్వరం, ప్రాణహిత, తుమ్మిడిహట్టి ప్రాజెక్టులను పరిశీలించనున్నట్టు పేర్కొన్నారు. రెండోసారి కేసీఆర్ అధికారం చేపట్టాక రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని చాడ విమర్శించారు.
Chada Venkatareddy
KCR
Hyderabad
Kaleswaram
Pranahitha
Tummidihatti

More Telugu News