ap: ఏపీ కొత్త మంత్రి వర్గం కూర్పు పూర్తి.. మంత్రి వర్గంలో బొత్స, అవంతి, కొడాలి నాని తదితరులకు స్థానం!

  • ఒక ముస్లిం సహా 8 మంది బీసీలు
  • ఐదుగురు ఎస్సీలు, నలుగురు కాపులు, నలుగురు రెడ్డి కులస్థులు 
  • ఎస్టీ, కమ్మ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాలకు స్థానం

ఏపీ కొత్త మంత్రి వర్గం కూర్పు పూర్తయింది. మంత్రి వర్గంలో ఒక ముస్లిం సహా ఎనిమిది మంది బీసీలు, ఐదుగురు ఎస్సీలకు, నలుగురు కాపులు, నలుగురు రెడ్డి కులస్థులకు, ఎస్టీ, కమ్మ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాలకు స్థానం దక్కింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతికి డిప్యూటి స్పీకర్ పదవి వరించింది.

మంత్రి వర్గంలో బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని, తానేటి వనిత, పుష్పశ్రీ వాణి, సుచరిత, కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్ (ఎమ్మెల్సీ), పినిపే విశ్వరూప్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, మోపిదేవి వెంకటరమణ, బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, నారాయణస్వామి, అంజాద్ బాషా, శంకర్ నారాయణ, అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌతమ్ రెడ్డి లకు చోటు దక్కింది.

More Telugu News