allu arjun: త్రివిక్రమ్, బన్నీ సినిమాకి సెకండ్ హీరోయిన్ దొరికేసింది

  • బన్నీ హీరోగా త్రివిక్రమ్ మూవీ
  •  కొనసాగుతోన్న సెకండ్ షెడ్యూల్
  •  ప్రధాన నాయికగా పూజా హెగ్డే

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ తాజా చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం రెండవ షెడ్యూల్ షూటింగు జరుపుకుంటోంది. కథా పరంగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అవసరమట. ప్రధాన కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్నారు.

మరో కథానాయికగా ఎవరికి ఛాన్స్ దక్కనుందా అనే ఆసక్తి అందరిలోను నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని నివేదా పేతురాజ్ దక్కించుకుంది. తాజా షెడ్యూల్ షూటింగులోను ఆమె పాల్గొంది. సాయిధరమ్ తేజ్ జోడీగా 'చిత్రలహరి' సినిమా ద్వారా నివేదా పేతురాజ్ తెలుగు తెరకి పరిచయమైంది. రెండవ సినిమాతోనే ఆమె త్రివిక్రమ్ - బన్నీ కాంబినేషన్లో అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం. 

More Telugu News