Old Woman: కశ్మీర్లో రెచ్చిపోయిన అల్లరిమూకలు.. వృద్ధురాలికి అండగా నిలిచిన జవాను.. ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు!

షార్ట్స్‌లో చూడండి
ఈద్ పండుగ రోజు కూడా కశ్మీర్‌లో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. నేడు ఈద్ ప్రార్థనల అనంతరం బారాముల్లాలో అల్లరి మూకలు పౌరులపై రాళ్ల దాడికి తెగబడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన ఓ సంఘటన భద్రతా బలగాల ఔన్నత్యాన్ని మరోసారి కళ్లకు కట్టింది. అల్లరి మూకల రాళ్ల దాడిలో బ్రిడ్జిపై వెళుతున్న ఓ వ‌ృద్ధురాలు గందరగోళంలో పడిపోయింది. కేకలు పెడుతూ సాయం కోసం అర్థించింది.

ఆమె బాధను ఆలకించిన ఓ జవాను ఆమెకు అండగా నిలిచి సురక్షితంగా బ్రిడ్జి దాటించాడు. తన ప్రాణాలు కాపాడిన జవానుకు వృద్ధురాలు ధన్యవాదాలు తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను జమ్మూకశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మరోసారి భారత జవానుల ఔన్నత్యాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Go Back to Shorts
Old Woman
Jawan
Baramullah
Jammu Kashmir
Eid

More Telugu News