Mahesh Babu: 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'మహర్షి'

  • మే 9వ తేదీన వచ్చిన 'మహర్షి'
  • 27 రోజుల్లో 200 కోట్ల గ్రాస్ 
  • నైజామ్ లో అత్యధిక వసూళ్లు      

మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన 'మహర్షి' మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయవిహారం చేసింది. కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతూనే వుంది.

ఈ సినిమా విడుదలైన 27 రోజులకి 200 కోట్ల గ్రాస్ ను రాబట్టేసి 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక నైజామ్ ఏరియాలో ఈ సినిమా మహేశ్ బాబు కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించింది. ఆకట్టుకునే కథాకథనాలు .. కట్టిపడేసే ఎమోషన్స్ .. మహేశ్ బాబు డిఫరెంట్ లుక్స్ .. పూజా హెగ్డే గ్లామర్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయని అంటున్నారు. మొత్తానికి ఈ ఏడాది ప్రథమార్ధంలోనే మహేశ్ బాబు తన పేరుతో కొత్త రికార్డును నమోదు చేసేశాడు.

More Telugu News