accident: ఆడుకుంటూ వెళ్లి... సాంబారులో పడి మూడేళ్ల బాలుడి మృతి

  • వంట చేస్తుండగా ఘటన
  • ఆడుకుంటూ వెళ్లి పడిపోయిన బాలుడు
  • గమనించే సరికే మృతి

నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగింది. వేడి సాంబారులో పడి బాలుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వంట చేస్తున్న చోట  చిన్నారి ఆడుకుంటున్నా ప్రమాదాన్ని ఊహించక పోవడం, పిల్లాడిని పట్టించుకోక పోవడంతో బాలుడి తల్లిదండ్రులకు తీవ్రవిషాదం మిగిలింది. వివరాల్లోకి వెళితే...ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా హోళగుందకు చెందిన మంజునాథ్‌, మల్లమ్మ దంపతుల కొడుకు రాజశేఖర్‌ వయసు మూడేళ్లు.

మంజునాథ్‌ కుటుంబ సభ్యులు ఆదివారం కర్ణాటకలోని హులిగికి దైవదర్శనం నిమిత్తం వెళ్లారు. సోమవారం మొక్కు తీర్చుకుని అక్కడే వంట చేసుకుంటున్నారు. సమీపంలోనే మంజునాథ్‌ కొడుకు రాజశేఖర్‌ ఆడుకుంటున్నాడు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వంట పనుల్లో నిమగ్నమై ఉండగా రాజశేఖర్‌ ఆడుకుంటూ అప్పుడే సిద్ధం చేసిన సాంబారు గిన్నె వద్దకు వెళ్లాడు. అనుకోకుండా అందులో పడిపోవడంతో ప్రాణాలు పోయాయి. ఈ విషయాన్ని మంజునాథ్‌ కుటుంబ సభ్యులు గమనించే సరికే చిన్నారి విగత జీవిగా మారాడు.

More Telugu News