రంగారెడ్డి జిల్లాలో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకున్న దొంగలు

షార్ట్స్‌లో చూడండి
తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగలు పక్కా ప్రణాళికతో చోరీలకు పాల్పడుతున్నారు. ఆ విధంగా రంగారెడ్డి జిల్లాలో మూడిళ్లలో దొంగతనానికి పాల్పడి పోలీసులకు సవాలుగా మారారు. జిల్లాలోని ముచ్చర్లలో మూడిళ్లలో చోరీకి పాల్పడిన దొంగలు, సుమారు లక్ష రూపాయల నగదుతో పాటు 10 తులాల బంగారాన్ని అపహరించారు. విషయం తెలుసుకున్న బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. 
Go Back to Shorts
Ranga Reddy District
Thief
Gold
Money
Police
Clues Team

More Telugu News