Cricket: సఫారీ బౌలింగ్ ను చితకబాదుతున్న బంగ్లాదేశ్ బ్యాట్స్ మన్లు

  • టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న సఫారీలు
  • రాణించిన షకీబ్, రహీమ్
  • శుభారంభం అందించిన సౌమ్య సర్కార్

లండన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ జూలు విదిల్చారు. రబాడా, ఎంగిడి, తాహిర్ లతో కూడిన పటిష్టమైన దక్షిణాఫ్రికా బౌలింగ్ ను అలవోకగా ఎదుర్కొంటూ భారీ స్కోరు దిశగా సాగిపోతున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తన ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 16 పరుగులకే అవుటైనా, మరో ఓపెనర్ సౌమ్య సర్కార్ 42 పరుగులు చేసి శుభారంభం అందించాడు. ఆ తర్వాత వచ్చిన షకీబల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ ధాటిగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు.  వీరిద్దరూ అజేయమైన మూడో వికెట్ కు 141 పరుగులు జోడించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 34.4 ఓవర్లలో 2 వికెట్లకు 216 పరుగులు చేసింది. షకీబ్ 74, రహీమ్ 71 పరుగులతో ఆడుతున్నారు.

More Telugu News