karthikeya: 'హిప్పీ'తో బరిలోకి దిగుతోన్న దిగాంగన

  • టీఎన్ కృష్ణ దర్శకుడిగా 'హిప్పీ'
  • కథానాయికగా 'దిగాంగన' పరిచయం 
  • ఈ నెల 6వ తేదీన విడుదల   

కార్తికేయ కథానాయకుడిగా టీఎన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన 'హిప్పీ' సినిమా, ఈ నెల 6వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా దిగాంగన సూర్యవన్షి పరిచయమవుతోంది. ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇటు దర్శకుడు కృష్ణ ... అటు కీలకమైన పాత్రను పోషించిన జేడీ చక్రవర్తి ఒక రేంజ్ లో ఈ సుందరిని పొగిడేశారు. ఆమె గ్లామర్ ను .. నటనా పటిమను ప్రశంసించారు.

దాంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ అమ్మడిపైకి వెళ్లింది. ప్రస్తుతం తెలుగులో రష్మిక మందన .. పాయల్ రాజ్ పుత్ తమ దూకుడు చూపుతున్నారు. వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ అగ్రస్థానం దిశగా దూసుకుపోతున్నారు. మరి దిగాంగన వాళ్ల రేస్ లో జాయిన్ అవుతుందా లేదా అనేది, 'హిప్పీ' సినిమా విడుదలైతేగాని తెలియదు. 

More Telugu News