mahatma gandhi: మహాత్ముడికి మోదీ నివాళి

  • నేడు ప్రమాణస్వీకారం చేయనున్న మోదీ
  • గాంధీ, వాజ్ పేయిల సమాధులను సందర్శించిన మోదీ
  • మోదీ వెంట అమిత్ షాతో పాటు పలువురు అగ్రనేతలు

భారత ప్రధానిగా నరేంద్ర మోదీ నేడు రెండో సారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో, ఈ ఉదయం ఆయన జాతిపిత మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు. రాజ్ ఘాట్ కు వెళ్లిన ఆయన... మహాత్ముడి సమాధిపై పూలు చల్లి, ప్రదక్షిణలు చేసి, నమస్కరించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర అగ్ర నేతలు ఉన్నారు. మాజీ ప్రధాని దివంగత వాజ్ పేయి సమాధిని కూడా మోదీ సందర్శించారు. ఆయనకు ఘన నివాళి అర్పించారు. రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్ లో మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

More Telugu News