అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లిన మోదీ

  • అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ
  • ప్రధానికి లేఖ
  • వెంటనే స్పందించిన మోదీ
రేపు ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ ఇవాళ మోదీకి లేఖ రాశారు. కొత్తగా ఏర్పాటయ్యే క్యాబినెట్ లో తాను బాధ్యతలు స్వీకరించలేనని, ఆర్థిక మంత్రి పదవికి తనను పరిగణనలోకి తీసుకోవద్దంటూ జైట్లీ లేఖలో స్పష్టం చేశారు. దీనిపై మోదీ వెంటనే స్పందించారు.

జైట్లీ పరిస్థితి పట్ల చలించిపోయిన మోదీ ఆయన నివాసానికి వెళ్లారు. జైట్లీ ఆరోగ్య స్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. జైట్లీ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన మోదీ వారికి ధైర్యం చెప్పారు. అయితే, క్యాబినెట్ లో చేరలేను అంటూ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించుకోవాలని జైట్లీని కోరారు. మోదీ విజ్ఞప్తి పట్ల జైట్లీ నిస్సహాయత వ్యక్తం చేసినట్టు సమాచారం.
Go Back to Shorts
Narendra Modi
Arun Jaitly

More Telugu News