kantharao: ఒకే ఒక్క సూట్ కేస్ తీసుకుని మా నాన్న చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు: కాంతారావు కుమారుడు రాజా

  • ఆస్తులన్నీ పోయాయి 
  • చెన్నై నుంచి హైదరాబాద్ కి మకాం
  •  సీరియల్స్ లో అవకాశాలు ఆదుకున్నాయి  

వెండితెర రాకుమారుడిగా ఒక వెలుగు వెలిగిన కాంతారావు, చివరి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తాజా ఇంటర్వ్యూలో ఆ విషయాలను గురించి ఆయన కుమారుడు రాజా ప్రస్తావించాడు. "చెన్నై నుంచి హైదరాబాద్ కి చిత్రపరిశ్రమ వచ్చేసింది. దాంతో అవకాశాల కోసం నాన్న హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే ఆస్తులన్నీ పోగొట్టుకోవడం జరిగిపోయింది.

 మా అమ్మనీ .. నా తమ్ముడిని వెంటబెట్టుకుని ఒకే ఒక్క షూట్ కేసుతో ఆయన హైదరాబాద్ వచ్చారు. నారాయణగూడాలోని ఒక హోటల్లో దిగారు. 15 రోజుల పాటు అక్కడే వున్నా, నాన్న పట్ల గౌరవంతో వాళ్లు ఒక్క రూపాయి తీసుకోలేదు. ఆ తరువాత అద్దెకి వెళ్లి .. నిత్యావసర వస్తువులు కొనుక్కున్నాము. హైదరాబాద్ కి వచ్చిన తరువాత నాన్నకి వచ్చిన సినిమా అవకాశాలు తక్కువ. సీరియల్స్ లో అవకాశాలు ఆర్థికపరమైన బలాన్నిచ్చాయి" అంటూ ఆయన చెప్పుకొచ్చారు. 

More Telugu News