Narendra Modi: మే 30న రాత్రి 7 గంటలకు మోదీ ప్రమాణస్వీకారం

  • ముహూర్తం ఖరారు
  • ప్రకటన చేసిన రాష్ట్రపతి భవన్
  • మోదీతో ప్రమాణం చేయించనున్న రామ్ నాథ్ కోవింద్

వరుసగా రెండో పర్యాయం ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన దరిమిలా ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోదీ మే 30వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని రాష్ట్రపతి భవన్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. మోదీతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆ ప్రకటనలో వెల్లడించారు.

కాగా, అదేరోజు ఏపీలో జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ప్రమాణం చేసేలా ముహూర్తం నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి మోదీ హాజరయ్యే అవకాశాలున్నాయి. ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మోదీ తిరిగి ఢిల్లీ చేరుకుని పీఎంగా ప్రమాణస్వీకారానికి సన్నద్ధమవుతారని తెలుస్తోంది.

More Telugu News