New Delhi: కాంగ్రెస్ సీనియర్ నేత షీలాదీక్షిత్‌ను ఓడించి.. ఇంటికెళ్లి ఆశీర్వాదం తీసుకున్న బీజేపీ నేత

  • ఈశాన్య ఢిల్లీ నుంచి షీలాపై పోటీ
  • 3.6 లక్షల మెజారిటీతో తివారీ ఘన విజయం
  • మాజీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నేత

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్‌ను ఓడించిన ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ.. నేరుగా ఆమె ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన మనోజ్ తివారీ కాంగ్రెస్ అభ్యర్థి షీలాదీక్షిత్‌పై 3.6 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అంతేకాదు, ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది.

షీలాపై భారీ మెజారిటీతో విజయం సాధించిన మనోజ్ తివారీ శనివారం షీలా దీక్షిత్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల ఆమె అనారోగ్యం పాలైనట్టు వార్తలు రావడంతో ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.

More Telugu News