Telangana: నీతిగా పని చేశాను..ప్రజలు గెలిపించారు: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు
  • పరిపాలనను గాలికొదిలేసి దోచుకుతింటున్నారు
  • విభజన హామీల అమలు కోసం పోరాడతా
నీతిగా పని చేశాను కనుకే ప్రజలు తనను గెలిపించారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. పరిపాలనను గాలికొదిలేసి, టీఆర్ఎస్ దోచుకుతింటోందని ఆరోపించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు కోసం పార్లమెంట్ లో పోరాడతామని చెప్పారు.
Telangana
congress
komati reddy
mp

More Telugu News