Kodali Nani: ఎన్టీఆర్ కుటుంబసభ్యులు చంద్రబాబును, లోకేశ్ ను తరిమికొట్టి టీడీపీని కాపాడుకోవాలి: కొడాలి నాని

  • హరికృష్ణ కుమార్తెను, అవినాశ్ ను బలిపశువులుగా చేశారు
  • లోకేశ్ కు మాత్రం దొడ్డిదారిన ఎమ్మెల్సీ ఇచ్చుకున్నారు
  • జగన్ ఎప్పుడూ నీచరాజకీయాలు చేయలేదు

గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో మరోసారి విజయం సాధించిన వైసీపీ నేత కొడాలి నాని ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ కుమార్తెను, ఏపీ ఎన్నికల్లో దేవినేని అవినాశ్ ను రాజకీయ బలిపశువులుగా చేశారని ఆరోపించారు. తన కొడుకు లోకేశ్ కు మాత్రం దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రిని చేసుకున్నారని మండిపడ్డారు.

ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఇకనైనా చంద్రబాబును, లోకేశ్ ను పారద్రోలి టీడీపీని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. నీచరాజకీయాలకు చంద్రబాబు పెట్టిందిపేరని కొడాలి నాని ధ్వజమెత్తారు. జగన్ ఏనాడూ ప్రజాప్రతినిధులను వారి పదవులుండగా పార్టీలోకి తీసుకోలేదని, రాజీనామా చేసిన తర్వాతే పార్టీలోకి తీసుకున్నారని, కానీ చంద్రబాబు వేరొక పార్టీలో పదవులున్నవారిని తన పార్టీలోకి తీసుకునే నీచుడు అని మండిపడ్డారు.

More Telugu News