సార్వత్రిక ఎన్నికల్లో కమలహాసన్ పార్టీ పరిస్థితి ఇదీ!
- అన్నింటా పోటీచేసిన ఎంఎన్ఎం
- ఒక్కచోటా గెలవని వైనం
- తన పార్టీ 15 నెలల పసికందు అన్న కమల్
దీనిపై కమలహాసన్ మాట్లాడుతూ, తన ఎంఎన్ఎం పార్టీ కేవలం 15 నెలల పసికందు అని అభివర్ణించారు. పార్టీపై ప్రజలు నమ్మకం ఏర్పరచుకోవడానికి తగినంత సమయం లేకపోయిందని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎంఎన్ఎంకు ఓటేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించడం అనేది ప్రజాతీర్పు అని, అయితే, అదే ఎన్డీఏ తమిళనాట ఒక్కస్థానంలో గెలవడం కూడా ప్రజల వైఖరిగానే భావించాలని తెలిపారు.