delhi: ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో సంబరాలు.. మోదీ-అమిత్ షాలపై పూల వర్షం!

  • ‘మోదీ’ నినాదాలతో మార్మోగుతున్న ప్రాంగణం  
  • మోదీ వెంట అమిత్ షా, కేంద్ర మంత్రులు
  • అధిక సంఖ్యలో హాజరైన కార్యకర్తలు, నాయకులు

దేశ వ్యాప్తంగా 284 స్థానాలు సాధించి, 62 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న బీజేపీ కేంద్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాల్లో ఉన్నారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం ఉన్న ప్రాంతంలో ఓ పక్క వర్షం కురుస్తున్నప్పటికీ ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు  అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ తదితరులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఘనస్వాగతం లభించింది. మోదీ-అమిత్ షాలపై పూల వర్షం కురిపించారు. ‘మోదీ..మోదీ’ నినాదాలతో కార్యాలయ ప్రాంగణం మార్మోగుతోంది. ప్రజలను ఉద్దేశించి మోదీ కొద్ది సేపట్లో ప్రసంగించనున్నారు.

More Telugu News