YSRCP: ‘నేను మంచి ముఖ్యమంత్రిని’ అని అనిపించుకుంటా: వైఎస్ జగన్

  • ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక కృతఙ్ఞతలు
  • ఈ విజయం నాపై బాధ్యతను మరింత పెంచింది
  • తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం నుంచి జగన్

ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఐదు కోట్ల మంది ప్రజల్లో ఏ ఒక్కరికో వస్తుందని ఏపీలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న వైసీపీ అధినేత జగన్ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ విజయం తనపై ఉన్న బాధ్యతను మరింత పెంచిందని అన్నారు.

తనకు ఎంతో గొప్ప విజయం అందించిన ప్రజలకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ‘ఆరు నెలల నుంచి సంవత్సరంలోపే ‘జగన్ మంచి ముఖ్యమంత్రి’ అని మీ అందరితో అనిపించుకుంటాను’ అని మాట ఇచ్చారు. తనపై ఈ విశ్వాసం ఉంచిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.

More Telugu News