Andhra Pradesh: ఏపీలో జిల్లాలవారీగా పోలైన పోస్టల్ బ్యాలెట్, పోస్టల్ సర్వీస్ ఓట్లు ఇవే!

  • రేపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు
  • కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తిచేసిన ఈసీ
  • శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక పోస్టల్ బ్యాలెట్లు 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్, పోస్టల్ సర్వీస్ ఓట్ల వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలోని లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో 28,662 పోస్టల్ సర్వీస్ ఓట్లు పోలయ్యాయని ఈసీ తెలిపింది. అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 29,592 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని చెప్పింది. రేపు ఉదయం 7 గంటల్లోగా తమకు అందే పోస్టల్ బ్యాలెట్లనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జిల్లాలవారీగా వచ్చిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వివరాలను ఈసీ విడుదల చేసింది.

శ్రీకాకుళం జిల్లా -8,121 ఓట్లు
విజయనగరం జిల్లా -2,564 ఓట్లు
విశాఖపట్నం జిల్లా -3,333 ఓట్లు
తూర్పుగోదావరి జిల్లా -923 ఓట్లు
కృష్ణా జిల్లా -457 ఓట్లు
గుంటూరు జిల్లా -3,036 ఓట్లు
ప్రకాశం జిల్లా -3,765 ఓట్లు
నెల్లూరు -362 ఓట్లు
వైఎస్సార్ కడప జిల్లా -1,175 ఓట్లు
కర్నూలు జిల్లా -1,935 ఓట్లు
అనంతపురం జిల్లా -1,676 ఓట్లు
చిత్తూరు జిల్లా -2,185 ఓట్లు

More Telugu News