Nara Lokesh: వీవీ ప్యాట్లు సిద్ధంగా ఉంటే లెక్కించడానికి ఏమైంది?: నారా లోకేశ్

  • చాలా పార్టీలు వీవీ ప్యాట్లను వ్యతిరేకిస్తున్నాయి
  • టీడీపీ పోరాట ఫలితమే వీవీ ప్యాట్లు
  • చంద్రబాబు అంకితభావంతో పోరాడుతున్నారు

ఎన్నికల ఫలితాలు వెల్లడికావడానికి మరొక్క రోజు సమయం మిగిలున్న నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ వీవీ ప్యాట్ల అంశంపై స్పందించారు. వీవీ ప్యాట్లు సిద్ధంగా ఉన్నప్పుడు వాటిని ఎందుకు లెక్కించరు? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. వీవీ ప్యాట్ల ఉపయోగం ఉంది కాబట్టే వాటిని ప్రవేశపెట్టారని ట్వీట్ చేశారు.

తెలుగుదేశం పార్టీ పోరాట ఫలితమే ఎన్నికల విధానంలో వీవీ ప్యాట్లను తీసుకువచ్చారని స్పష్టం చేశారు. ఇప్పుడు ఎందుకు ఈ పార్టీలన్నీ వీవీ ప్యాట్ల అంశంలో ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నాయో, ఎందుకు విముఖత వ్యక్తం చేస్తున్నాయో అర్థంకావడంలేదని మండిపడ్డారు. కానీ, చంద్రబాబునాయుడు మాత్రం ఇతర పార్టీలకు భిన్నంగా ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు చిత్తశుద్ధితో కూడిన పోరాటం సాగిస్తున్నారని నారా లోకేశ్ కితాబిచ్చారు.

More Telugu News