రైల్లో వేధింపులు, పోలీసుల నిర్లక్ష్యం: ఫేస్ బుక్ లో ఓ యువతి వ్యధ
- బెంగళూరులో ఐటీ ఉద్యోగినిగా పనిచేస్తున్న బాధితురాలు
- రైల్లో వెళుతుంటే వృద్ధుడి వేధింపులు
- కేసు నమోదు చేసుకోవడంలో నిర్లక్ష్యం
జరిగిన ఘటనపై తొలుత వైట్ ఫీల్డ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, అది తమ పరిధి కాదని, అడుగోడి పోలీసుల వద్దకు వెళ్లాలని సూచించారు. అడుగోడి పోలీసు స్టేషన్ లోనూ ఆమెకు నిరాశే ఎదురైంది. వారు కూడా తమ పరిధి కాదని, రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. బాధితురాలు కంటోన్మెంట్ పోలీసులను ఆశ్రయించి, తనకు జరిగిన అన్యాయాన్ని చెబితే, నిందితుడి ఫోటో ఉందా?, అడ్రస్ ఉందా?, అతని పేరేంటి? వంటి ప్రశ్నలు వేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని వాపోయింది. ఈ పోస్ట్ ను కేంద్ర రైల్వేశాఖతో పాటు మహిళ శిశు సంక్షేమశాఖకు కూడా బాధితురాలు ట్యాగ్ చేసింది. ఈ పోస్ట్ వైరల్ కాగా, నిందితుడిని పట్టుకోవాల్సిందేనని పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది.