Hyderabad: నరసరావుపేటలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

  • ఏడుగురు క్రికెట్ బుకీల అరెస్టు
  • పరారీలో ముగ్గురు నిందితులు
  • నిందితుల నుంచి రూ.25 లక్షలు స్వాధీనం

గుంటూరు జిల్లా నరసరావు పేటలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వేర్వేరు కేసులకు సంబంధించి ఏడుగురు క్రికెట్ బుకీలను అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.25 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

 హైదరాబాద్ లో ఫోన్ కాల్స్ డైవర్ట్ చేసే ముఠా అరెస్టు

హైదరాబాద్ లో అంతర్జాతీయ ఫోన్ కాల్స్ ను లోకల్ కాల్స్ గా  డైవర్ట్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. లోకల్ కాల్స్ గా డైవర్ట్ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక ల్యాప్ టాప్, సిమ్ బాక్స్ లు, కాల్ డైవర్టింగ్ కిట్, మూడు సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. టెలికాం అధికారులతో కలిసి ఈ ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు ఫలక్ నుమా ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.  

More Telugu News